Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి గెలిచారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత సీనియర్లకే స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!
New Update

Ayyanna Patrudu as AP Assembly Speaker: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి బరిలోకి దిగిన అయ్యన్న విజయం సాధించారు. దీంతో ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా అయ్యన్న తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో అత్యంత సీనియర్లకే స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అయ్యన్నకు ఈ పదవి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్ర వాసికే స్పీకర్ పదవి ఇచ్చారు. ఇదిలాఉండగా.. తనకు స్పీకర్‌ పదవి ఇవ్వాలని గతంలో రఘురామకృష్ణరాజు పార్టీ అధిష్ఠానికి చెప్పారు.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు

#telugu-news #ayyanna-patrudu #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe