AP News: సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.!

ఏపీ సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారని..రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ , విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిమాత్రమే బాగుపడ్డారంటూ ఆరోపించారు.

Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు
New Update

AP News: ఏపీ సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారని..రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ , విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిమాత్రమే బాగుపడ్డారంటూ ఆరోపించారు. రేపల్లెలో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ చేసేవి శవరాజకీయాలని..తాను చేసేవని ప్రజా రాజకీయాలన్నారు చంద్రబాబు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్ ప్రజలను మోసం చేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. పదవిని బాధ్యతగా తీసుకుని తాను పనిచేస్తే ..జగన్ సొంత వ్యాపారాలకు అధికారాన్ని వాడుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. జగన్ వచ్చాక అమరావతిని నాశనం చేశారన్నారు. అన్ని రంగాలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను బాధితులను వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కాల్వల నిర్వహణ కూడా చేయకుండా పంటలను మంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాన్ పిక్ ను పునరుద్దరించి నిజాంపట్నం ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్..6నెలల పాటు డబ్బు విత్ డ్రాలు క్లోజ్..!

#chandrababu #ys-jagan #ap-news #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe