AP: నారా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించిన కేంద్రం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ కల్పించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం తెలిపింది.

New Update
AP: నారా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించిన కేంద్రం

Z Category Security For Nara Lokesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ కల్పించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించాలని నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ జగన్ కు జెడ్ కేటగిరి కల్పించింది. ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరిన తర్వాత 2 ప్లస్ 2 సెక్యూరిటీని పెంచింది. ఇప్పుడు మళ్లీ జడ్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కాగా నారాలోకేశ్ కు జడ్ కేటగిరి భద్రత కల్పించినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీలో ఉన్న కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు కేంద్ర ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు సమాచారం అందించారు.

Also Read: సమ్మర్‎లో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..వేడిని తట్టుకునేలా..!

Advertisment
తాజా కథనాలు