Allagadda : ఉలిక్కి పడ్డ ఆళ్లగడ్డ.. టీడీపీ నేత భార్య హత్య!

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మంగళవారం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Allagadda : ఉలిక్కి పడ్డ ఆళ్లగడ్డ.. టీడీపీ నేత భార్య హత్య!
New Update

Andhra Pradesh : నంద్యాల (Nandyala) జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ (TDP) నేత భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) అత్యంత సన్నిహితురాలు హత్యకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి (AV Bhaskar Reddy), ఆయన సతీమణి శ్రీదేవి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

మంగళవారం సాయంత్రం భాస్కర్‌ రెడ్డి దంపతుల కళ్లల్లో కారంచల్లి దాడి చేశారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో శ్రీదేవి అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి కి చేరుకున్నారు. అప్పటికే పోస్టుమార్టం కోసం శ్రీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శ్రీదేవి భౌతికకాయాన్ని పరిశీలించిన భూమా అఖిలప్రియ.. పోలీసులను అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు.

దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిల ప్రియ పోలీసులను కోరారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ఇతరత్రా కారణాలు ఏవైనా హత్యకు కారణమా అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read: రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే..వర్షాలు!

#tdp #av-bhaskar-reddy #nandyala-district #allagadda #bhuma-akhila-priya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి