AP Elections: నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం... క్షమాపణలు చెప్పాలని డిమాండ్

భువనేశ్వరిపై మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణస్వామి చిత్రపటాన్ని టీడీపీ నేత‌ వంగలపూడి అనితతోపాటు తెలుగు మహిళలు చెప్పుల‌తో కొట్టారు. భువనేశ్వరికి నారాయణస్వామి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని అనిత విమ‌ర్శించారు.

New Update
AP Elections: నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం... క్షమాపణలు చెప్పాలని డిమాండ్

విశాఖ టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద మంగ‌ళ‌వారం నిర‌స‌న వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై వంగలపూడి అనిత పలు విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని సంచలన కామెట్స్‌ చేశారు. 36 రోజులుగా చంద్రబాబుని పెట్టి జైల్లో హింసిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ బులిటీన్‌లో షుగర్ లెవల్స్ రిపోర్ట్ లేకపోవడం దారుణమన్నారు. సజ్జల ఊరకుక్కలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని తీవ్ర వాఖ్యలు చేశారు. డీప్యూటీ సీఎం నారాయణస్వామి అమ్మ లాంటి భువనేశ్వరిపై పిచ్చి కూతలు కూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు

లోకేష్‌ని సీఎం చెయ్యడం కోసం భువనేశ్వరి భోజనంలో విషం పెడుతుందని వైసీపీ నాయకులు మట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. శవాల గుట్ట మీద పుట్టిన పార్టీలో ఉన్న వ్యక్తివి అంటూ ఆమె ఆరోపించారు. సొంత బాబాయిని చంపి సీఎం కుర్చీ ఎక్కిన వ్యక్తి పార్టీలో ఉన్నావ్ అంటూ ఆరోపించారు. కోడి కత్తి కేసులో దళితుడిని 5 ఏళ్లుగా జైల్లో మగ్గేలా చేసిన పార్టీలో ఉన్న వ్యక్తివి అని ధ్వజమెత్తారు. దళిత డాక్టర్‌ను అన్యాయంగా చంపేసినప్పుడు ఈ నారాయణస్వామి ఎక్కడ.. ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితుల్ని చిత్ర హింసలు పెట్టినప్పుడు ఈ డిప్యూటీ ఎక్కడ..? అని ప్రశ్నించారు. సొంత మండలానికి జడ్పీటీసీ ఆయన భార్య.. ఆమెకు పదవి లేకపోతే డిప్యూటీకి భోజనం ఉండదు అంటూ ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో తెలుగోడుని తలలెత్తుకునేలా చేసిన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే అత్యున్నత మహిళ భువనేశ్వరి అని అనిత తెలిపారు.

నారాయణస్వామికి రోజులు దగ్గర పడ్డాయి

అలాంటి బువనమ్మ కోసం మాట్లాడిన నారాయణ స్వామికి రోజులు దగ్గర పడ్డాయి అంటూ హెచ్చరించారు. ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తాదని దీమా వ్యక్తం చేశారు. 9 కిలోమీటర్లు జర్నీ కోసం హెలికాప్టర్ ఎక్కి రికార్డ్ సృష్టించిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్‌కి విపరీతమైన భయం ఉంది. బువనమ్మ కోసం తప్పుడు కూతలు కూస్తే ఇళ్లకొచ్చి కొడతాం అంటూ హెచ్చరించారు. లైవ్‌లో నారాయణ స్వామి చిత్రపటాన్ని చెప్పుతో కొట్టారు అనిత.

ఇది కూడా చదవండి:  సిరిసిల్లకు సీఎం…ఏం వరాలు ఇవ్వబోతున్నారు

Advertisment
తాజా కథనాలు