జితేంద్ర కుమార్‌ది వైసీపీ స‌ర్కారు హ‌త్యే: నారా లోకేష్

జితేంద్ర కుమార్‌ది వైసీపీ స‌ర్కారు హ‌త్యే అని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత లోకేష్. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజ‌మాన్యం ఎందుకు స్పందించ‌డంలేదు? అని ప్రశ్నించారు.

New Update
చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్!

Nara Lokesh: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసిన‌వారు టీటీడీ విజిలెన్స్ సిబ్బందిలా లేరు, వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాడితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఆత్మహ‌త్యకు పాల్పడిన విద్యార్థి జితేంద్ర కుమార్‌ది ఆత్మహ‌త్య కాదు.. ఇది ముమ్మాటికీ వైసీపీ స‌ర్కారు చేసిన‌ హ‌త్య అని ధ్వజమెత్తారు.

ALSO READ: ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

వైసీపీ నేత‌ల అనుచ‌ర‌ గ‌ణంతో క‌లిసి విజిలెన్స్ సిబ్బంది హాస్టల్‌లో చేస్తున్న పెత్తనాన్ని ఎదిరించినందుకే జితేంద్ర కుమార్‌పై క‌క్ష క‌ట్టి మ‌రీ అంతం చేశారని ఫైర్ అయ్యారు. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజ‌మాన్యం ఎందుకు స్పందించ‌డంలేదు? అని ప్రశ్నించారు.

టీటీడీ అధికారులు, ఛైర్మన్‌, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల యాజ‌మాన్యం విద్యార్థి మృతిపై స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోందని అన్నారు. జితేంద్రకుమార్ కుటుంబానికి రూ.50 ల‌క్షలు ప‌రిహారం చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలని అన్నారు.

ALSO READ: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..


Advertisment
తాజా కథనాలు