TDP: విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్న టీడీపీ కార్యాలయం!

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు.

New Update
TDP: విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్న టీడీపీ కార్యాలయం!

TDP: మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీడీపీ వర్గాల్లో ఉత్సాహం పొంగుతోంది. సాధారణ కార్యకర్తల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరకు గెలుపు తమదేనని ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ వర్గాలు సైతం ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు. ఫలితాలు వెల్లడి కాకముందే టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని లైటింగ్ తో డెకరేట్ చేయడం చూస్తుంటే, గెలుపుపై ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.

Also read: విజయవాడ కు చేరుకున్న బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్!

Advertisment
తాజా కథనాలు