Andhra Pradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు కీలక సందేశం..

ఏపీలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గెలిచారని.. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని మని పేర్కొన్నారు.

New Update
Andhra Pradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు కీలక సందేశం..

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. 164 స్థానాల్లో కూటమి భారీ విజయాన్ని కూడగట్టుకోగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ' ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గెలిచారు. ఈరోజు నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని తిరిగి సొంతం చేసుకునే యుద్ధంలో మనం గెలిచాం. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం. మన కూటమి నేతలు, కార్యకర్తలు శ్రమ ఫలితమే ఈ విజయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ. కేంద్రమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనసేన పార్టీకీ, పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు.

Also Read: తేలిన ఎన్నికల ఫలితాలు.. ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పిన రవిప్రకాష్

Advertisment
తాజా కథనాలు