Exit Poll: ఏపీలో అధికారం వాళ్లేదే.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా తేల్చిచెప్పింది. కూటమికి 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

New Update
Exit Poll: ఏపీలో అధికారం వాళ్లేదే.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే

India Today - Axis My India Exit Poll On AP Results: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా తేల్చిచెప్పింది. కూటమికి 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. కూటమిలో టీడీపీకి 78-96, జనసేన 16 -18, బీజేపీ 4-6 స్థానాల్లో గెలవనున్నాయని వెల్లడించింది. అలాగే కాంగ్రెస్‌ 0-2 స్థానాలు దక్కంచుకోనుందని తెలిపింది.

Also Read: జూన్ 3న ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఆరు గ్రహాలను చూడొచ్చు

ఇక పార్టీ వారీగా ఓట్ల శాతం చూసుకుంటే.. వైసీపీకి 44 శాతం, టీడీపీకి 42 శాతం, జనసేనకు 7 శాతం, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం, ఇతరులకు 3 శాతం వచ్చే ఛాన్స్ ఉందని ఇండియా టుడే - యాక్సిస్‌ మై ఇండియా తేల్చిచెప్పింది.

Advertisment
తాజా కథనాలు