AP Politics: వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్

దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని, ఈ సైకో ప్రభుత్వం పోవాలి అంటే అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

New Update
AP Politics: వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్

Andhra Pradesh Politics:  ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ప్రజలెవ్వరూ కూడా జగన్ పాలన పట్ల సంతృప్తిగా లేరని ఆరోపించారు. అన్నిటికీ నేనున్నాను అంటాడు.. కానీ 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఒక్కహామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగనన్న ఇళ్ళు అంటూ పేదలందరినీ మోసం జగన్ చేశాడని చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. మన ప్రభుత్వం వచ్చాక ఇంతకంటే ఎక్కువ స్థలాలు ఇచ్చి మంచి గృహాలు నిర్మిస్తామన్నారు. ఈ సైకో ప్రభుత్వం పోవాలి అంటే అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పదాల గురించి తెలుసుకోండి.. పిల్లలకు మంచి అలవాట్లు వస్తాయి

Advertisment
తాజా కథనాలు