BREAKING: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
రాజకీయ నాయకులు పంచాయితీ.. పోలీసులకు తలనొప్పిగా మారింది. కాకినాడలోని గోకివాడ గ్రామంలో డ్రైనేజీకి పోలీసులు కాపాలాగా ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణే ఇందుకు కారణం.
అనకాపల్లి జిల్లాలో మంత్రి గుడివాడ అమర్నాధ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చోడవరం జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఒక బోగస్ యాత్ర కు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనం ఆస్తి పంపకాలను చూస్తుంటాం.. డబ్బును పంచుకోవడం చూసుంటాం... రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను చూసుంటాం.. కానీ ఫ్లెక్సీల కోసం ఊళ్లో వీదులు పంచుకోవడం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు ఊరునే వైసీపీ నేతలు పంచుకున్నారు.
వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
నిన్న సాయంత్రం అమిత్ షాతో నారా లోకేష్ భేటీ కావడం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కోసం పురందేశ్వరి ఈ స్కెచ్ వేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ పొత్తుకు ఇది సంకేతమన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో 8 వేల మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది.
వైజాగ్ రాజకీయమంటేనే సమ్థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీకే దక్కాయి. దీంతో 2024లో విశాఖ రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతుండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.