వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. సాయం తిరుపై ప్రజలతో ముఖాముఖి
ఈ మధ్య భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రెండు రోజులు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురి అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించి వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా సీఎం మాట్లాడుతారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి మరి తెలుసుకుంటారు సీఎం జగన్.