Yadadri: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే... ఈ వివరాలు మీ కోసమే..!!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి.