Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
ఏపీలో నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కంప్లైంట్లు చేయడంతో ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఈసీ. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటూ ఏపీలో పర్యటించనుంది.
విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా పని చేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచిన విషయం తెలిసిందే.
విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తనతోనే చెప్పారని కేశినేని నాని స్పష్టం చేశారు . పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దని, తిరువూరుకు ఇన్ చార్జిగా మరొకరుని నియమించారన్నారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని నాని చెప్పారు.
విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ విజయవాడలో INDIA కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీపై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారంటూ కామెంట్స్ చేశారు.
అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
స్పా ముసుగులో వ్యభిచార కూపం నడిపిస్తున్న నిర్వాహకుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్థానికుల సమాచారంతో విజయవాడ బందర్ రోడ్ లో సిరి థాయ్ స్పా, ట్రానికిల్ స్పాల్లో రైడ్స్ నిర్వహించగా 9 మంది మహిళలు, 3 విటులను అదుపులోకి తీసుకుని నిర్వహకులపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.