VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు కానుక అందించారు. తెలంగాణ, ఏపీలో కలిపి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాచిగూడ -యశ్వంత్ పూర్, ఏపీ-చెన్నై వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్...బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.