Peddapalli: పెద్దపల్లిలో దారుణం.. వానరాల ఉసురు ఊరికే పోదు!
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 50కి పైగా కోతులను చంపి పారేశారు. కొండలు అంతరించి పోవటంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వస్తున్నాయి. చనిపోయిన కోతులను చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.