TG News : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు!
జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకే గోధుమలు ఇస్తామన్నారు. బియ్యం నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.