Hyderabad Crime : అధికారిపై చేయి చేసుకున్న కార్పొరేటర్... జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిక!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్పై కేసు నమోదైంది. నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.