అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది.
రేవంత్ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్.. సూసైడ్ నోట్లో
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.
కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ సంచలన ఎజెండాతోనే ప్రజల్లోకి..!
త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
రేవంత్కు బీఆర్ఎస్ బిగ్ షాక్.. అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు
సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు.
Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?
అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి.