తెలంగాణాకు మహర్దశ.. || New Corporations & Muncipalities In Telangana || CM Revanth Reddy || RTV
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారంటూ విమర్శలు చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది.
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.
త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.