భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు.! | Deputy CM Bhatti Vikramarka Special Puja | Telangana Budget 2025
తెలంగాణ బడ్జెట్ లో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖకు రూ. 12 వేల393 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్.. 27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మణానికి రూ. 2700 కోట్లు కేటాయించింది.
తెలంగాణ బడ్జెట్ లో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన వెలువడింది. పౌర సరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అలాగే సన్న బియ్యం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ 2025 26లో రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు కేటాయించినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందుతాయని ఆయన వెల్లడించారు.
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను 2025-26 ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది.
ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది. బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది.