మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు
ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు.