Tirumala baby: కనీసం మానవత్వం ఉందా..? ప్రసన్న కుమార్రెడ్డిపై జనసేన ఫైర్
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డిపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రాణాలు కోల్పోయిన లక్షిత కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డిమాండ్ చేశారు. మరోవైపు అలిపిరి నడకదారి వెంట నడవాలంటేనే శ్రీవారి భక్తులు గజగజ వణుకుతున్నారు.