వైసీపీకి రాజీనామా.. వాసిరెడ్డి పద్మ షాకింగ్ కామెంట్స్ | Vasireddy Padma Resign to YSRCP | RTV
తనకు టికెట్ రాకున్నా జగన్ ను విమర్శిస్తూనే ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు..ప్రజలకు ప్రశ్నించే ఒక గొంతు కావాలని ఆ గొంతు తాను అవుతానంటూ రఘురామ కృష్ణంరాజు ఆర్టీవీతో ఇచ్చిన ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలున్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.
మా స్ట్రాటజీ కేవలం డెవల్ మెంట్ మాత్రమే...అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ వంటి 420గాళ్లకు తనను ఓడించేంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి కార్తీక. రేవంత్ రెడ్డి విధానం నచ్చకపోవడంతోనే తాను బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది కేవలం రెడ్లు మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు.
దళిత బంధు..భూమి పంచాయితీలు..బీఆర్ఎస్ అన్యాయం చేసిందని..ఈ విషయాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసే ప్రయత్నం నిందితుడు చేశాడని చాలామంది చెబుతున్నారు. ఈ కారణాలతో ప్రభాకర్ రెడ్డిపై నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేశానని పోసాని చెప్పారు. తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు తెలిపారు. నా కుటుంబానికి అంతా సెటిల్ చేసి పెట్టానని, తన చావు గురించి నా భార్యని కూడా ముందుగానే ప్రిపేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు.. నీ పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది.. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటుంటి ఇబ్బంది రాదన్నారు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ.8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశానని పోసాని తెలిపారు.