Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
టీ అమ్మే వ్యక్తి నుండి భారతదేశానికి ప్రధాని అయ్యే వరకు, మోదీ జీవిత కథ సినిమాలాగే మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ, అతని గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి. నేడు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 73 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన గురించి మీరు ఎప్పుడూ వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ ఎస్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు గతంలో రెండు సార్లు వచ్చిందని ఆయన అన్నారు. కానీ ఆ రెండు సందర్బాల్లో ఆయన ఆ అవకాశాన్ని మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పవార్ కు వయస్సు మీదపడిందన్నారు. అందుకే పవార్ రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు.