AP: రూ. 20 లక్షలు సీజ్.. తనిఖీలు ముమ్మరం చేపట్టిన అధికారులు..!
ప్రకాశం జిల్లా మల్లాపాలెం చెక్ పోస్ట్ వద్ద రూ. 20 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బులు తరలిస్తున్న కారుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.