ధరణి పై ప్రభుత్వం కీలక నిర్ణయం..| Telangana Govt Transfers Dharani Portal Management to NIC | RTV
మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది.
పేదల కోసం త్వరలో 4.50 లక్షల ఇళ్లు కట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంచుతామన్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు.
తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్కు కట్టుబడి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు APEPDCL నోటీసులు ఇచ్చింది. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది.
బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ నడుస్తోంది. భట్టి విక్రమార్క, పొంగులేటితో ఖర్గే సమావేశం అయ్యారు. తొలుత ఇద్దరితో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత విడివిడిగా మీటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి కల్లా ఖమ్మం అభ్యర్థితో పాటు కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
గడియారాల స్మగ్లింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హర్షరెడ్డి చెబుతున్నారు.
పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఖమ్మం జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.