PM Surya Ghar: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. ఈ పథకం ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించనుంది.