Karimnagar : కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి.. 12మంది పరిస్థితి విషమం
కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గౌరెడ్డిపేటలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున ఒడిశా కూలీలు రాత్రి వండుకున్న మాంసం ఉదయం తినడంతో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు.