Metro: ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు.. కేటీఆర్!
ప్రభుత్వ చర్యలతోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదన లేదని చెప్పి అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ బోర్డులు దర్శనమివ్వడాన్ని ఖండించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.