Lok Sabha Elections 2024: సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కేసీఆర్ బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి ఎవరంటే?
సికింద్రాబాద్ ఎంపీ సీటుపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం మార్చారు. మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మారావు పోటీలో ఉంటే విజయం ఖాయమని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.