Odisha Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి
ఒడిశా బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-18పై హైదరాబాద్కు చెందిన టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందగా... మరో 20మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.