Kishan reddy: కిషన్ రెడ్డి ఛాతీకి గాయం.. శరీరంపై గీరుకుపోయిన గోర్లు!
బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షకు దిగిన బీజేపీ అగ్రనేతలతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీక్షకు 6గంటల వరుకే పర్మిషన్ ఉందన్న పోలీసులు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని బలవంతంగా దీక్షాస్థలి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఛాతీకి గాయమైందని.. ఎక్స్రే తీయించుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.