Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా
రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ రోజు సూర్యాపేటలో జరిగిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.