PM Modi Telangana Tour: తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.