Mahua Moitra: మహువా మొయిత్రా లంచం తీసుకున్నారు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఎంపీ మహువా మెయిత్రాపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగడానికి ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన అభివర్ణించారు. దీనిపై విచారణ చేపట్టాలని.. ఆమెను పార్లమెంట్ హౌస్ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు.