BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ
పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.