TDP-JSP: రాజమండ్రిలో లోకేష్, పవన్ కీలక భేటీ.. సీట్ల లెక్కలు తేల్చేందుకేనా?
రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సీట్ల లెక్కలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.