మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు
మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఆయన ఆస్తులపై శనివారం సోదాలు నిర్వహించింది. నివాసాలు, కార్యాలయాలతో సహా 5చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడి తెలిపింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.