మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్.. 20 ఏళ్లకు చిక్కిన విక్రమ్ గౌడ!
కర్ణాటక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీస్, మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అతడు మరణించినట్లు హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పారు. విక్రమ్ కోసం 20 ఏళ్లుగా వేట సాగిందన్నారు.