Rajireddy: రాజిరెడ్డి..బతికే ఉన్నారా! అధికారికంగా క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు మల్లా రాజిరెడ్డి అలియాస్ అలియాస్ సాయన్న చనిపోలేదని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట ప్రకటన రిలీజ్ చేశారు.