Mahua Moitra : మహువా బహిష్కరణ వేటుపై దీదీ ఆగ్రహం.. ఏమన్నారంటే
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేకే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.