తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Rajagopal Reddy On KTR | RTV
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
తుంగతుర్తిలో తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు రెండింతలు అయ్యాయన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అంటూ ధ్వజమెత్తారు.
మునుగోడుకు చెందిన పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చేరిన వారిలో నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు.
కేసీఆర్ను ఓడించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకోనందుకే తాము బీజేపీలో నుంచి బయటకు వచ్చామని తెలిపారు. మా లక్ష్యం, మా ఆశయం కేసీఆర్ ను గద్దె దించడమే అన్నారు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు హైకమాండ్ నుంచి ఈ మేరకు హామీ లభించిందన్నారు. రాజగోపాల్ రెడ్డి వేరే ఎక్కడైనా పోటీ చేయాలని కోరారు.
తెలంగాణలో ఎన్నికల వేళ ఏ నేత ఏపార్టీలో ఉంటాడో, ఎందుకు మారుతాడో అర్థంకాని పరిస్థితులు దాపరించాయి. సరిగ్గా ఎన్నికలకు 40 రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్కు జంప్ చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఉన్న పార్టీని తిట్టడం, పక్క పార్టీని పొగడడం రాజగోపాల్రెడ్డికి అలవాటు. ఎన్నికలకు ముందు బీజేపీ బతుకు బస్టాండ్ చేసిన రాజగోపాల్రెడ్డి అసలు కాంగ్రెస్ను ఎందుకు వదిలిపెట్టాడు? మళ్లీ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
సీఎం కేసీఆర్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో నియంత పాలన ముగియబోతోందని, దొరల గడీలు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చేప్పారు.
బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి మునుగోడులో నిరసన సెగ తగిలింది. పార్టీ కుమ్ములాటలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కాస్త.. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.