APPSC : ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన!
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
దేశీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేక పోస్టుల కోసం బంపర్ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 84 పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 30 నవంబర్ 2023 వరకు చివరి తేదీ.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) కి సంబంధించి మొత్తం 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నో ఏళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మోటార్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 14 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. ఈ రిక్రూట్మెంట్లో 677 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుwww.mha.gov.inమీరు సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చా అనేదానిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అది అటెండర్ పోస్టు కాబట్టి క్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులు ఆ విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుందని.. ఈ నిర్ణయం వెనుక ఆచరణాత్మక అవరోధాలు ఉంటాయని.. హైకోర్టు తరపు స్టాండింగ్ కౌన్సెల్ స్వరూప్ తెలిపారు. అయితే ఆమె ఇప్పటి వరకూ ఇంటర్,డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేదు కాబట్టి ఆమె ప్రస్తుత విద్యార్హత 10వ తరగతి మాత్రమే అవుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కూమార్ అన్నారు.
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపటి (అక్టోబర్ 21)తో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరికొన్నిరోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన విద్యాశాఖ మరోవారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.