రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ
కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అటవీశాఖ ఏలూరు రేంజ్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమాడారు. అయితే ఈ పెళ్లికి రెండో భార్య సునీత సాక్షి సంతకం చేయడం విశేషం.