అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు..