Cricket: ఆ స్పీడేంట్రా బాబూ..భారత్కు మరో శ్రీనాథ్ దొరికేశాడు
ఐపీఎల్లో రెండు మ్యాచ్లను మళ్ళీ రీ షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగే మ్యాచ్లను అటుదిటు, ఇటుదిటుగా మార్చింది. కోలకత్తాలో శ్రీరామనవమి వేడుకల కారణంగానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆర్సీబీ లక్నో పై విజయం సాధించాలని ఎదురు చూస్తుంది.
ఏంటో పాపం ముంబై ఇండియన్స్కు ఈసారి ఐపీఎల్ అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు అయిన ముంబై టీమ్...అన్నింటిలోనూ పరాజయం మూటగట్టుకుంది. నిన్నటి మ్యాచ్లో అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో మరీ చెత్తగా ఓడిపోయింది.
గుజరాత్, హైదరాబాద్పై మ్యాచ్ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్ తప్పిదాలపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
విశాఖ గడ్డపై 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు ధోనీ. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీపై చెన్నై ఓడిపోయింది. ధోనీ అభిమానులను అలరించినా అతను బ్యాటింగ్కు దిగే సమయానికి మ్యాచ్ చేజారిపోయింది. దీంతో ధోనీ ముందు బ్యాటింగ్కు వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
విశాఖ వాసుల ఎదురు చూపులు ఫలించాయి. నిన్నటి మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ చేయడమే కాక ఉన్న కాసేపూ ధనాధన్లాడించి మరీ వెళ్ళాడు. దీంతో మ్యాచ్ ఓడిపోయినా...ధోనీ బ్యాటింగ్తో సంతృప్తి పడ్డారు ఫ్యాన్స్.
చెన్నై సూపర్ కింగ్స్ తో సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాాచ్ లో యువ బ్యాటర్ పృథ్వీ షా ఓపెనర్ గా బ్యాటింగ్ దిగుతాడో లేదా అనే విషయంపై దిల్లీ కోచ్ రికీపాంటింగ్ స్పందించారు.