Telangana: విద్యార్థులకు అలెర్ట్.. ఎప్సెట్, ఐసెట్ పరీక్షల తేదీలు మార్పు
లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై పడింది. మే 9 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన ఎప్సెట్ పరీక్షలను మే 7 నుంచి 11 వరకు జరిగేలా మార్పులు చేశారు. జూన్ 4, 5వ తేదీల్లో జరగాల్సిన ఐసెట్ పరీక్షను జూన్ 5,6 తేదీలకు మార్చారు.