Sahithi Infra Scam | సాహితీ ఇన్ఫ్రా భారీ స్కామ్ | Real Estate Fraud In Hyderabad | RTV
హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో లేక్ వ్యూ బదులు ‘గార్డెన్ ఫేస్’ అంటూ బిల్డర్లు ప్రచారం మొదలుపెట్టారు.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చుక్కలనంటాయి. దాదాపుగా 24% పెరుగుదలతో దేశంలోనే ఇళ్ల ధరల పెరుగుదలతో టాప్ ప్లేస్ లో నిలిచింది హైదరాబాద్. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ANAROCK వెల్లడించింది.
సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఅటాచ్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ సంస్థ.
దేశంలోనే అత్యధికంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల హైదరాబాద్ ఉంది. ఏడాది కాలంలోనే ధరల్లో 19శాతం పెరిగినట్లు క్రెడాయ్ కొలియర్స్ తాజాగా వెల్లడించిన హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్టులో పేర్కొంది. దేశంలో 8 పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. 2023 మూడో త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 5శాతం పెరిగాయి.