20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది.